సుభాష్ చంద్రబోస్
|
|
![]() |
|
జననం :
|
జనవరి 23,1897
కటక్, ఒరిస్సా |
మరణం :
|
ఆగస్టు 18,1945 (48 సంవత్సరాల వయసులో)
తైవాన్(అని భావిస్తున్నారు) విమాన ప్రమాదం(అని భావిస్తున్నారు) |
పదవి :
|
నేతాజీ
|
రాజకీయ పార్టీ :
|
భారత జాతీయ కాంగ్రెస్
ఫార్వర్డ్ బ్లాక్ |
భార్య :
|
ఎమిలీ షెంకెల్
|
సంతానం :
|
అనిత
|
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జననం: జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
బాల్యం, విద్య:
సుభాష్ చంద్రబోస్
1897 లో, భారత దేశంలోని ఒరిస్సా లోని కటక్ పట్టణం లో ఒక ధనిక కుటుంబం లో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం (Cambridge University)లోను సాగింది.
1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగిభారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.
భారత జాతీయ కాంగ్రెస్లో:
సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ తో కలసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. 1921లో వేల్స్ యువరాజు పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేసినందుకు గాను బోస్కు కారాగార శిక్ష విధించారు. 1924 ఏప్రిల్లో క్రొత్తగా ఏర్పడిన "కలకత్తా కార్పొరేషన్" ముఖ్యనిర్వహణాధికారిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం అక్టోబర్లో ఉగ్రవాదం అనుమానంపై బోస్ను అరెస్టు చేసి అలీపూర్ జైలులో ఉంచారు. తరువాత బర్మాలోని మాండలే జైలుకు పంపారు. మళ్ళీ 1930 జనవరి 23న స్వతంత్ర ప్రదర్శనను నిర్వహించినందుకు అరెస్టు చేశారు. విడుదలైన తరువాత కలకత్తా నగరం మేయర్గా ఎన్నికయ్యాడు. మొత్తానికి 20 సంవత్సరాల వ్వవధిలో బోస్ 11 సార్లు జైలు పాలయ్యాడు. 1930 దశకం మధ్యలో భారతదేశంనుండి బహిష్కృతుడయ్యాడు. అప్పుడు బోస్ ఐరోపాలో విస్తృతంగా పర్యటించాడు. ఎందరో మేధావులను, నాయకులను కలిశాడు. భారత దేశం స్వాతంత్ర్యం గురించి చాలా వేదికలలో ప్రసంగించాడు. మధ్యలో తన తండ్రి అంత్య క్రియలకు మాత్రం భారతదేశం వచ్చి వెళ్ళడానికి బోస్కు అనుమతి లభించింది.
ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో క్రొత్త భావాలు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్ధన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియా లో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తరువాత Letters to Emilie Schenkl అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.
1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్ధి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" (All India Forward Bloc) పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" (National Planning
Committee) అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.
స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక
:
బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ(Giuseppe
Garibaldi) మరియు మాజినీ (Giuseppe Mazzini)ల ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ (Kemal Atatürk) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.
దేశం
వీడి అజ్ఞాతం లోకి :
బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రాంభించాడు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా పెషావర్ చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVDఅతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్బర్గ్ కి అప్పగించారు. అతను బోస్ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్కు రిబ్బెన్ట్రాప్ నుండి, మరియు విల్హెల్మ్స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.
తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందినSpecial
Operations Executive (SOE)
ఈ పనిని చేపట్టింది.
జర్మనీలో :
ఇలా భారత దేశంనుండి ఆఫ్ఘనిస్తాన్,అక్కడినుండి రష్యా, అక్కడినుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో
"స్వతంత్ర భారత కేంద్రం"
(Free India Centre) స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన
4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట Wehrmacht,
తరువాత Waffen SS అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్కు, బోస్కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు -
"భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్ కు, భారత దేశపు స్వాతంత్ర్యానికోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడనై ఉంటాను:("I
swear by God this holy oath that I will obey the leader of the German race and
state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight
for India, whose leader is Subhas Chandra Bose") ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు - అలా అగ్రరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారత దేశం వదలి వెళతారని ఎలా అనుకొన్నాడని?.
1941 - 43 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు.
1943 లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29 లోకి మారాడు. ఆ రెండు దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతోసింగపూర్ లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరచుకొన్నాడు.
భారత జాతీయ సైన్యం
:
భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్ లో స్థాపించాడు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హై కమాండ్ కు చెందిన హికారీ కికాన్ కు మోహన్ సింగ్ కు భేదాలు రావడం వల్లనూ మరియు మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లనూ
disband చేశారు. మోహన్ సింగ్ ను అదుపు లోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్ర బోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లైంది. అదే సంవత్సరంలో జూలై లో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు.
మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.
తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందినSpecial Operations Executive (SOE) ఈ పనిని చేపట్టింది.
జర్మనీలో :
1941 - 43 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943 లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29 లోకి మారాడు. ఆ రెండు దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతోసింగపూర్ లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరచుకొన్నాడు.
భారత జాతీయ సైన్యం
:
“
|
మీ రక్తాన్ని ధారపోయండి. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను
|
”
|
ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా సాగింది.
ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ,క్రొయేషియా,థాయ్లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్ లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది.

freedom fighters history in telugu
ReplyDelete