మంగళ్ పాండే

మంగళ్ పాండే
c.19 జూలై 1827–8 ఏప్రిల్ 1857

జన్మస్థలం:నగ్వా, బల్లియా, అవధ్
నిర్యాణ స్థలం:బారక్ పూర్, కోల్కతా, భారతదేశం

1857 సిపాయిల తిరుగుబాటు

కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34 బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !

మంగళ్ పాండేపై సినిమాలు

గౌరవార్థం

తపాళా బిళ్ళ

భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం, అక్టోబరు 5, 1984 ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది. దీని చిత్రకారుడు ఢిల్లీ కి చెందిన సి.ఆర్. ప్రకాశ్.

No comments:

Post a Comment